ఏసీబీ వలలో ఓయూ డీఈ..రెండు నెలల్లో రిటైర్మెంట్.. రూ.11 వేలకు కక్కుర్తి

ఏసీబీ వలలో ఓయూ డీఈ..రెండు నెలల్లో రిటైర్మెంట్.. రూ.11 వేలకు కక్కుర్తి

ఉప్పల్​, వెలుగు: రెండు నెలల్లో రిటైర్​మెంట్​ కానున్న ఓయూ డీఈ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓయూ బిల్డింగ్​ డివిజన్​ సిటీ రేంజ్​‌‌‌‌‌‌‌‌యూనిట్​లో రాకొండ శ్రీనివాసులు డిప్యూటీ ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. మానేరు బాయ్స్​ హాస్టల్​ పునరుద్ధరణ పనులకు సంబంధించి కాంట్రాక్టర్​కు రూ.14 లక్షల బిల్లు  రావాల్సి ఉంది.

 ఇందులో సగం వరకు బిల్లు విడుదల చేయాల్సి ఉండగా, డీఈ శ్రీనివాసులు రూ.11 వేలు డిమాండ్​ చేశాడు. సదరు కాంట్రాక్టర్​ రూ.5 వేలు బదిలీ చేశాడు. మిగతా రూ.6 వేలు కూడా ఇవ్వాలని కాంట్రాక్టర్​ను డీఈ ఒత్తిడి చేశాడు. దీంతో కాంట్రాక్టర్​ ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం రూ.6 వేలు డీఈ శ్రీనివాసులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు.