అందరికీ ఉపాధి కల్పించడమే మా బాధ్యత : తలసాని

అందరికీ ఉపాధి కల్పించడమే మా బాధ్యత : తలసాని

తెలంగాణలో ఎక్కడా ప్రాంతీయ విభేదాలు లేవని మంత్రి తలసాని స్పష్టం చేశారు. అందరికీ ఉపాధి కల్పించడమే తమ బాధ్యత అని తెలిపారు. అధికారంలోకి చాలా రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి... కానీ ప్రజలకు ఏ పార్టీ సేవ చేస్తుందనేదే ముఖ్యం అని చెప్పారు. అధికారంలో ఉన్న తమ పార్టీ పేదలకోసం, కార్మికుల కోసం, రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకోచ్చిందన్నారు. 24 గంటల విద్యుత్తుని, మంచి ట్రాన్స్ ఫోర్ట్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని వర్గాల, అన్ని రాష్ట్రాల వాళ్ళని అక్కున చేర్చుకుంటున్న ప్రభుత్వం తమదని గర్వంగా చెప్పారు. 

అక్కడక్కడ, అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి.. కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలని మంత్రి తలసాని సూచించారు. మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండ్ల స్థలాలు మీకు వస్తాయిని, అన్ని రంగాలలో ప్రతీ కార్మికుడి వెనకాల ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు. సీఎం పుట్టినరోజు ఇంత ఘనంగా నిర్వహించినందుకు కార్మికులకు ధన్యవాదాలు తెలియజేశారు. అంతకుముందు యూసఫ్ గూడ స్టేడియంలో తెలుగు టెలివిజన్ & డిజిటల్ టెక్నిషియన్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం, వేణుగోపాల చారి పాల్గొన్నారు.