ఓయూ, వెలుగు:తమను రెగ్యులరైజ్చేయాలని కోరుతూ ఓయూలోని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పోస్ట్కార్డుల ఉద్యమం చేపట్టారు. మంగళవారం ఓయూ ఆర్ట్స్కాలేజీ నుంచి పోస్ట్ఆఫీస్వరకు ర్యాలీగా వెళ్లారు. పర్మినెంట్చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్కు లెటర్లు రాసి పోస్ట్చేశారు.
కాంట్రాక్ట్ టీచర్స్అసోసియేషన్ లీడర్లు డాక్టర్ పరశురామ్, తాళ్లపల్లి వెంకటేశ్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డి.తిరుపతి, రమేశ్, కృష్ణయ్య, కోటినాయక్, మీనా తదితరులు పాల్గొన్నారు. అలాగే విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. చాలీచాలని వ తనాలతో ఇబ్బందులు పడుతున్నామని, ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు.
