
చెన్నై :కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ తరుపున సేవలు చేస్తానని తెలిపారు హాస్యనటి కోవై సరళ. ఆమె శుక్రవారం మక్కల్ నీది మయ్యం పార్టీ చేరారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కమల్ హాసన్ కు మద్దతుగా ప్రచారం చేస్తానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. చెన్నైలో మక్కల్ నీది మయ్యం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమల్ హాసన్ ఇవాళ కోవై సరళను పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. కోవై సరళకు పార్టీ సభ్యత్వాన్ని అందించిన కమల్ హాసన్ ఆమె సేవలు అవసరమని అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్దమవుతున్న కమల్ హాసన్ కు కోవై సరళ పార్టీలో చేరిక కోయంబత్తూరు పరిసర కొంగునాడు ప్రాంతంలో కొంత బలాన్నిస్తుందంటున్నారు.
Actress #kovaisarala joined #Nammavar @ikamalhaasan 's #MakkalNeedhiMaiam ??
This dynamic leader celebrating #WomensDay with the real hero padman #Arunachalam pic.twitter.com/TEsVKGmh8q— சினிமாபுரம் (@cinemapuram) March 8, 2019