ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో సంస్థ వేసవి ప్రయాణాలు చేసే వారి కోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. వేసవి ట్రిప్స్చేసే భారతీయులకు స్టే నౌ పే లేటర్(ఎస్ఎన్ పీ ఎల్) అనే ఆఫర్ను ప్రకటించింది. ఈ ఫీచర్ ప్రయాణికులపై తక్షణ ఆర్థిక భారం పడకుండా తమ టూర్లను ప్లాన్ చేసుకునేలా అనుమతిస్తుంది. సింప్ల్ అనే క్రెడిట్ ఆధారిత చెల్లింపుల ద్వారా ఈ సేవల్ని అందిస్తోంది.
ఎస్ఎన్ పీఎల్ కస్టమర్లకు గరిష్ఠంగా రూ.5 వేల వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తుంది. ఇది హోటల్ లో స్టే చేసిన 15 రోజుల తర్వాత సెటిల్ చేసుకోవచ్చు. ఓయో యాప్హోం స్క్రీన్లో ఫీచర్ని యాక్సెస్ చేసి, అనంతరం తమ అవసరాలకు సరిపోయే ప్లాన్ని ఎంచుకోవాలి. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. త్వరలో ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.