OYO రూమ్స్ బంపరాఫర్ : ఇప్పుడు ఉండండి.. 15 రోజుల తర్వాత బిల్లు కట్టండి

OYO రూమ్స్ బంపరాఫర్ : ఇప్పుడు ఉండండి.. 15 రోజుల తర్వాత బిల్లు కట్టండి

ప్రముఖ హోటల్​ అగ్రిగేటర్ ఓయో సంస్థ వేసవి ప్రయాణాలు చేసే వారి కోసం ఒక బంపర్​ ఆఫర్​ ప్రకటించింది. వేసవి ట్రిప్స్​చేసే భారతీయులకు స్టే నౌ పే లేటర్​(ఎస్​ఎన్​ పీ ఎల్) అనే ఆఫర్​ను ప్రకటించింది. ఈ ఫీచర్​ ప్రయాణికులపై తక్షణ ఆర్థిక భారం పడకుండా తమ టూర్​లను ప్లాన్​ చేసుకునేలా అనుమతిస్తుంది. సింప్ల్​ అనే క్రెడిట్​ ఆధారిత చెల్లింపుల ద్వారా ఈ సేవల్ని అందిస్తోంది.

ఎస్ఎన్ పీఎల్ కస్టమర్​లకు గరిష్ఠంగా రూ.5 వేల వరకు క్రెడిట్​ పరిమితిని అందిస్తుంది. ఇది హోటల్ లో స్టే చేసిన 15 రోజుల తర్వాత సెటిల్​ చేసుకోవచ్చు. ఓయో యాప్​హోం స్క్రీన్​లో ఫీచర్​ని యాక్సెస్​ చేసి, అనంతరం తమ అవసరాలకు సరిపోయే ప్లాన్​ని ఎంచుకోవాలి. ఈ ఫీచర్​ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. త్వరలో ఐఓఎస్​ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.