- డాక్టర్ పి.హనుమంతరావు
సికింద్రాబాద్, వెలుగు: దేశానికి భవిష్యత్అయిన చిన్నారుల అభివృద్ధిపై సోషల్వర్కర్లు ఎక్కువగా దృష్టిపెట్టాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పి.హనుమంతరావు సూచించారు. సమాజాభివృద్ధిలో సోషల్ వర్కర్ల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో ఎన్నో రకాలైన సామాజిక అసమానతలు, కుటుంబాల్లో సమస్యలు పెరుగుతున్నాయని, వాటి నుంచి బయటపడేలా సోషల్వర్కర్లు ప్రజలకు సపోర్ట్ఇవ్వాలని సూచించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ‘ సోషల్ వర్క్టీచింగ్,లెర్నింగ్లో సవాళ్లు’ అంశంపై సికింద్రాబాద్ పీజీ కాలేజీలో రెండురోజుల సదస్సుకు శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. ఇటీవలి కాలంలో చిన్నారుల్లో ఆటిజం, ఏడీహెచ్డీ లాంటి సమస్యలు పెరుగుతున్నాయన్నారు.
దేశంలో ప్రస్తుతం చిన్నారుల్లో 14 శాతం మంది వివిధ రకాలైన లెర్నింగ్డెఫిషియెన్సీతో బాధపడుతున్నారన్నారు. అలాంటి వారిని గుర్తించి సరైన సమయంలో ఇంటర్వెన్షన్, క్వాలిటీ ట్రైనింగ్ఇస్తే వారిలో చాలావరకు సమస్యను తగ్గించవచ్చన్నారు. పర్యవరణ పరిరక్షణకు సోషల్వర్కర్లు కృషి చేయాలని ప్రముఖ పర్యావరణవేత్త, రిటైర్డ్ ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి సూచించారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అర్జున్రావు, సింపోజియం కన్వీనర్ ప్రొఫెసర్ పి.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.