చంద్రయాన్ 3 విజయంపై పాక్ ఏడుపులు.. అన్ని దేశాల విజయమంటూ కామెంట్లు

చంద్రయాన్ 3 విజయంపై పాక్ ఏడుపులు.. అన్ని దేశాల విజయమంటూ కామెంట్లు

భారత పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 విజయవంతమైన సంగతి విదితమే. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ విక్రమ్.. చంద్రుడి దక్షిణ ధృవంపై సేఫ్‌గా ల్యాండ్‌ అయ్యింది. ఈ విజయంతో దేశమంతటా సంబరాలు మిన్నంటుతున్నాయి. జనం రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇదిలావుంటే దాయాది దేశం పాకిస్తాన్‌లో కూడా చంద్రయాన్ విజయంపై అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయం భారతదేశానికి మాత్రమే కాదు.. దక్షిణాసియా మొత్తానికి ఇది ఒక చారిత్రక సందర్భం అంటూ అభినందనలు తెలుపుతున్నారు. ఈ మేరకు ట్వీట్లు పెడుతున్నారు. ఈ అభినందనలను మనం మెచ్చుకోవాల్సిందే. 

పాక్ యువత ఏడుపులు

కాకపోతే మరికొందరు పాక్ అభిమానులు ఈ విజయంపై ఏడుపు లెక్కిస్తున్నారు. విఫలమవ్వాల్సిందని కోరుకునే వారు కొందరైతే.. ఏదో ఒక రోజు పాకిస్తాన్ కూడా ఇలాంటి ఘన కీర్తిని అందుకుంటుందని తమ మాటగా చెప్తున్నవారు మరికొందరు. అందుకు సంబంధించిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.