3‑0తో సిరీస్ నెగ్గిన ఇంగ్లిష్ టీమ్
కరాచీ: సొంతగడ్డపై పాకిస్తాన్ ఘోర అవమానం మూటగట్టుకుంది. 17 ఏండ్ల గ్యాప్ తర్వాత పాక్ టూర్కు వచ్చిన ఇంగ్లండ్ మూడు టెస్టుల సిరీస్ను 3–0తో క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం ముగిసిన మూడో, చివరి టెస్టులో ఇంగ్లిష్ టీమ్ 8 వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. పాక్ ఇచ్చిన167 రన్స్ టార్గెట్ను రెండే వికెట్లు కోల్పోయి ఈజీగా గెలిచింది.
ఓవర్నైట్ స్కోరు112/2తో నాలుగోరోజు ఆట కొనసాగించిన స్టోక్స్సేన విజయానికి అవసరమైన మరో 55 రన్స్ను కేవలం 38 నిమిషాల్లోనే రాబట్టింది. బెన్ డకెట్ (82 నాటౌట్), బెన్ స్టోక్స్ (35 నాటౌట్) రాణించారు. తొలి ఇన్నింగ్స్లో పాక్ 304, ఇంగ్లండ్ 354 స్కోర్లు చేశాయి. రెండో ఇన్నింగ్స్లో పాక్ 216 రన్స్కే ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు.