పాకిస్తాన్ సైనిక రాజకీయం

పాకిస్తాన్ సైనిక రాజకీయం

అగ్రదేశం అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల  సైనిక సామర్థ్యంపై  ఒక నివేదికను ప్రచురించింది, భారతదేశానికి ప్రధాన శత్రువు చైనా అని, పాకిస్తాన్ భారతదేశంపై చైనాకు కాంట్రాక్టర్ మాత్రమే అని అమెరికా రక్షణశాఖ తన నివేదికలో పేర్కొంది. 1962 నుంచి భారతదేశంపై యుద్ధం చేయడానికి చైనా పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో భారతదేశంతో పాకిస్తాన్ సామరస్యంగా వ్యవహరించడానికి శాంతిని కొనసాగించడానికి చైనా ఎప్పటికీ అనుమతించదు. పహల్గాంలో జరిగిన టెర్రరిస్టుల దాడి అనంతరం పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఉగ్రవాద స్థావరాలపై  భారతదేశం  ఆపరేషన్  సిందూర్ చేపట్టింది.  చైనా పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భారీసంఖ్యలో క్షిపణులు,  యుద్ధ విమానాలు,  నౌకలను ఇచ్చినప్పటికీ, భారతదేశం పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సులభంగా ఓడించగలదని  ఆపరేషన్​ సిందూర్​ నిరూపించింది.  ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్  జరిపిన దాడిని భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. 

భారత్​ చేతిలో పాకిస్తాన్​ ఓడిపోయినా చైనా  కొత్త యుద్ధవిమానాలు, ఆయుధాలు, ఇతర  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను పాకిస్తాన్​కు సరఫరా చేయడం ప్రారంభించింది.  అంటే  భారతదేశంతో తదుపరిచేసే యుద్ధంలో పాకిస్తాన్  భారీస్థాయిలో ఆయుధాలను కలిగి ఉంటుందని దీని సందేశం.  అయితే,  చైనా పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  భారీగా  డబ్బు లేదా ఆయుధాలు ఇచ్చినా  చైనా ఎప్పటికీ చేయలేనిది ఒకటి ఉంది.   పాకిస్తానీయుల డీఎన్​ఏని లేదా వారి రాజకీయ సైన్యాన్ని లేదా పాకిస్తాన్ సైన్యంలోని విస్తృతమైన అవినీతిని చైనా ఎన్నటికీ  మార్చలేదు. భారతదేశంలో ప్రొఫెషనల్ సాయుధ దళాలు ఉన్నాయి.  ఇండియన్​ ఆర్మీలో మెరిట్, ఈ క్వాలిటీతోపాటు  ప్రతిభకు తగిన గుర్తింపు ఉంటుంది. 

పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాజకీయ సాయుధ దళాలు 

భారతదేశం నుంచి విడిపోయి 1947లో పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందినప్పటినుంచి  వారి సైన్యం రాజకీయంగా ప్రాబల్యం కలిగి ఉంది.  ఉన్నత స్థాయిలో ప్రతి నియామకం, పదోన్నతి,  బదిలీ ఆర్మీ చీఫ్ ఇష్టాయిష్టాల ఆధారంగా జరుగుతుంది.  సహజంగా  ప్రతి దేశానికి రక్షణగా  ఒక సైన్యం ఉంటుంది. కానీ, పాకిస్తాన్ సైన్యం అధీనంలోనే ఆ దేశం ఉంది. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అసలు ‘యుద్ధ జాతులు (మార్షల్​ రేసెస్​)’ గిరిజన పఠాన్లు, బలూచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు.  కానీ, 1947 నుంచి  పంజాబీలు అటువంటి యోధుల తెగలను భర్తీ చేశారు. ఎక్కువగా జనరల్స్ 1947 తర్వాత భారతదేశం నుంచి వలస వచ్చిన వ్యక్తులు ఉన్నారు. జనరల్ జియా ఉల్ హక్, ముషారఫ్, జావేద్ బజ్వా,  ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అందరూ భారత్​ నుంచి  వలస వెళ్లిన పంజాబీలు.  వారు పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వలస వెళ్లి పాకిస్తాన్ సైన్యాన్ని మత, వ్యాపార, రాజకీయ శక్తిగా మార్చివేశారు. పాకిస్తాన్  ఏర్పడి ఉనికిలో ఉన్న గత 78 సంవత్సరాలలో ఆ దేశాన్ని పాక్​సైన్యం 45 సంవత్సరాలు ప్రత్యక్షంగా పాలించింది. పాకిస్తాన్   సైన్యం  ప్రజలు ఎన్నుకున్న  ప్రతి ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో పదవీ కాలం పూర్తి చేయకుండానే తొలగించింది.

  భారత సైన్యం పూర్తిగా ప్రొఫెషనల్

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన భారతీయులందరిని సైన్యంలో కొనసాగించాలని మన నాయకులు నిర్ణయించుకున్నారు.  దీని వలన సైనిక  సంప్రదాయాలు, క్రమశిక్షణ  తదితర అంశాల్లో  రాజకీయ జోక్యం లేకపోవడం జరిగింది. భారతదేశపు సైన్యంలో పదోన్నతులు, 
పోస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు,  క్రమశిక్షణ మొదలైన విషయాలలో భారత సాయుధ దళాలలో ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా కొనసాగుతోంది.  మన దేశ సర్వోన్నత న్యాయస్థానమైన  సుప్రీంకోర్టు కూడా భారత సాయుధ దళాల కార్యకలాపాల్లో చాలా అరుదుగా జోక్యం చేసుకుంటుంది. భారతదేశవ్యాప్తంగా  యువకులు నేటికీ సాయుధ దళాలలో చేరడానికి ఎంతో ఆసక్తిగా పోటీపడుతుంటారు.  ఈ క్రమంలో  మీరు భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి చెందిన ఇండియన్​ ఆర్మీ  అధికారులు సైన్యంలో​ ఉండటాన్ని గమనించవచ్చు.  ఇండియన్​ ఆర్మీ 1947 నుంచి  నిరంతరం యుద్ధాలు చేస్తోంది. భారత సైనికులు  చైనా,  పాకిస్తాన్  రెండు దేశాలతోనూ  పోరాడారు.  పోరాటంలో భాగంగా  సరిహద్దు ప్రాంతాలలో తిరుగుబాట్లను కూడా అణచివేశారు. భారత సైన్యం  శ్రీలంకకు కూడా సహాయకారిగా  వెళ్ళింది.  పాకి
స్తాన్ సైన్యం భారతదేశంతో  యుద్ధాలు చేసింది. 

భారతదేశంతో చేసిన యుద్ధాలన్నింటిలోనూ పాకిస్తాన్ ఓటమిపాలైంది. భారత సైన్యం యుద్ధ అనుభవం ప్రపంచంలోనే అత్యున్నతమైనది.  మన మొత్తం సైనిక దళాలు పాకిస్తాన్ లేదా చైనా సైన్యం కంటే  విద్యాపరంగా వారికంటే  మెరుగైన విద్యావంతులు. భారత సైన్యంలో బహుశా ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావంతులు ఉన్నారని చెప్పవచ్చు. ఈ పరిణామం సాంకేతిక పరిజ్ఞానంలో ప్రావీణ్యం సంపాదించే సామర్థ్యాన్ని ఇస్తుంది. 

పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చైనా సహాయం

పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎన్ని ఆయుధాలు ఇచ్చినా వారి సైనిక సామర్థ్యం భారతదేశపు సైనిక సామర్థ్యానికి  సరిపోదని చైనాకు తెలుసు.  పాకిస్తాన్ సైన్యం అవినీతిమయం అని ఆ దేశ సైన్యం భారతదేశ  సాయుధ దళాలతో సమానం కాలేదని చైనా  గ్రహించింది.  అందుకే,  చైనాతోపాటు  పాకిస్తాన్ అణ్వాయుధాల గురించి ఎక్కువగా మాట్లాడుతూనే ఉంటాయి. కానీ, ఆపరేషన్ సిందూర్​తో ఇండియన్​ ఆర్మీ సత్తా చాటిన తరువాత పాకిస్తాన్​ అణ్వాయుధాల బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెయిల్ కూడా భారతదేశాన్ని ఆపలేదని తేలింది. చైనా  ఎంత ప్రయత్నించినా  పాకిస్తానీయుల  స్వభావాన్ని మార్చలేదు.  సింహంలా దుస్తులు ధరించినా నక్క ఎప్పటికీ సింహం కాలేదు.  ఒకవిధంగా పాకిస్తాన్ సైన్యం పరాన్నజీవిలాంటిది.  పాక్​ సైన్యం..అవినీతి, వివిధ జాతులుగా విభజనకు గురైందని చైనాకు తెలుసు. భారతదేశం పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దాడి చేస్తుందని చైనా కూడా ఎప్పుడూ భావించలేదు.

భారతదేశం అప్రమత్తంగా ఉండాలి

భారత సైన్యం పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అన్నివిధాలుగా  మించిపోయినప్పటికీ,  మన దేశం పాకిస్తాన్​ పట్ల  అప్రమత్తంగానే ఉండాలి.  ఆపరేషన్  సిందూర్ తర్వాత పాకిస్తాన్,  చైనా తమ మునుపటి ప్రణాళికలన్నింటినీ మార్చుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ జనరల్స్ నటుల వలె ఆడంబరంగా దుస్తులు ధరిస్తారు.  పాకిస్తాన్  భారత సైన్యం కంటే  ముందుండే  ఒకే ఒక విషయం ఉంది.  అదేంటంటే.. పాకిస్తాన్ అత్యంత అలంకారమైన,  గొప్ప సైనిక యూనిఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కలిగి ఉంది.  పాకిస్తాన్ జనరల్స్ ను గమనిస్తే వారు  పోరాడే జనరల్స్​గా  కాకుండా సినిమా నటుల వలె కనిపిస్తారు.  కాగా, ఏ దేశపు  సైనిక విజయాలైనా ఆ దేశానికి చెందిన  సైనికులు, సైనిక అధికారులపై ఆధారపడి ఉంటాయి. సైన్యంలో లేదా మరే ఇతర సామాజిక ప్రయోగాలలో ఎప్పుడూ రాజకీయ జోక్యం ఉండకూడదు. సైన్యం దేశభక్తి,  ప్రతిభను కాపాడుకోవాలి. భారత సైన్యం భారతదేశంలోని రాజకీయ, సామాజిక తుపానులలో భాగం కాకూడదు. సైనిక బలంగా ప్రొఫెషనల్​గా ఉండాలి. అన్నింటికంటే మించి, భారత సైన్యం బలంగా ఉంటే మన శత్రువులు మనపై యుద్ధాలు ప్రారంభించడానికి భయపడతారు. 

పాకిస్తాన్​ చరిత్రలో  ముగ్గురు ప్రధానమంత్రులు  హత్యకు గురయ్యారు.  పాకిస్తాన్​ మొదటి ప్రధానమంత్రి లియాఖత్ అలీఖాన్ 1951లో హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత, జులిఫికర్ అలీ భుట్టో అదేవిధంగా ఆయన కుమార్తె బెనజీర్ భుట్టో కూడా హత్యకు గురయ్యారు. పాకిస్తాన్ సైన్యం చేసిన కుట్రల ద్వారా చాలామంది పాకిస్తాన్​ ప్రధానమంత్రులు  జైలుపాలయ్యారు. ప్రస్తుతం, మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్​ఖాన్ కూడా జైలులో ఉన్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆ దేశాన్ని పాలిస్తున్నాడు. అతనికి 7 మంది జనరల్స్ సహాయం చేస్తున్నారు. వారు పాకిస్తాన్​లోని ప్రతి రంగాన్ని,  ప్రతి అంశాన్ని నిర్ణయిస్తారు. పాకిస్తాన్​  అగ్ర న్యాయమూర్తులను కూడా పాక్ ​సైన్యం ఆమోదంతోనే నియమిస్తారు.

- డా. పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్​ ఎనలిస్ట్​