శంషాబాద్​ ఎయిర్​ పోర్టును పేల్చేస్తం..పాకిస్తాన్​ స్లీపర్​సెల్స్​ పేరుతో ఈ - మెయిల్

శంషాబాద్​ ఎయిర్​ పోర్టును పేల్చేస్తం..పాకిస్తాన్​ స్లీపర్​సెల్స్​ పేరుతో ఈ - మెయిల్
  • క్షుణ్ణంగా చేసిన తనిఖీ చేసిన సెక్యూరిటీ సిబ్బంది

శంషాబాద్, వెలుగు: పాకిస్తాన్ ​స్లీపర్​ సెల్స్​ పేరుతో శుక్రవారం శంషాబాద్ ఎయిర్​పోర్టుకు బాంబ్​బెదిరింపు ఈ – మెయిల్ వచ్చింది. ‘పాకిస్తాన్​పై ఆపరేషన్ సిందూర్ చేపట్టినందుకు ప్రతీకారంగా శంషాబాద్​ఎయిర్​పోర్టును బాంబులతో పేల్చేస్తాం.. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి చెప్పండి’ అని అందులో పేర్కొన్నారు. 

దీంతో అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ జవాన్లు, పోలీసులు ఎయిర్​పోర్టును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో అణువణువు గాలించారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థం కానీ, బాంబ్​కానీ లభ్యం కాలేదు. యుద్ధ సమయంలో ఫేక్ మెయిల్ అని కొట్టిపారేయలేమని, ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని ఎయిర్​పోర్టు అధికారులు తెలిపారు. ఈ– మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో లోతుగా విచారిస్తున్నామన్నారు. ఎయిర్​పోర్టుకు వచ్చి ప్రతి వ్యక్తిని, వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని చెప్పారు.