
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ కు ఎటూ పాలుపోవడం లేదు. దెబ్బకు దెబ్బ కొట్టాలని విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అంతర్జాతీయ సమాజంలో నవ్వుల పాలైన పాక్.. భారత్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా బుధవారం (మే 7) రాత్రి పంజాబ్ రాష్ట్రా్న్ని టార్గెట్ చేసుకుంది. పంజాబ్ బార్డర్ లోని పలు ప్రాంతాలపై మిస్సైల్స్ ను ప్రయోగించింది.
పంజాబ్ లోని అమ్రిత్ సర్, జలంధర్, లుధియానా ప్రాంతాలలో డ్రోన్స్, మిస్సైల్స్ తో ఆర్మీ బేస్ లపై టార్గెట్ చేసింది. వీటితో పాటు అదంపూర్, భటిండా, చండీఘర్ లోని మిలిటరీ బేస్ లను టార్గెట్ గా మిస్సైల్స్ ను వదిలింది. పంజాబ్, జమ్మూ కశ్మీర్ లోని మొత్తం 15 మిలిటరీ బేస్ లను ధ్వంసం చేయాలని పాక్ దాడి ప్రారంభించింది.
ఇండియన్ మిలిటరీ బేస్ కు కీలకమైన పంజాబ్ రాష్ట్రంలోని బేస్ క్యాంపులను ధ్వంసం చేయాలని చూసిన పాక్ వ్యూహాలను ఇండియన్ ఆర్మీ చిత్తు చేసింది. డ్రోన్స్, మిస్సైల్స్ ను న్యూట్రలైజ్ చేసింది. పాక్ ప్రయోగించిన మిస్సైల్స్, డ్రోన్స్ ను విచ్ఛిన్నం చేసేందుకు అత్యాధునిక ‘హార్పీ డ్రోన్స్’ను వినియోగించింది. లక్ష్యాన్ని టార్గెట్ చేసి కూల్చడంలో ఈ హార్పీ డ్రోన్స్ కచ్చితత్వంతో పనిచేస్తాయి.
పాకిస్తాన్ కు ధీటైన రిప్లై గా లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఆర్మీ ధ్వంసం చేసింది. పాక్ మిస్సైల్స్ ను ధ్వంసం చేసేందుకు రష్యా నుంచి స్వీకరించిన S-400 డిఫెన్స్ సిస్టమ్ ను వినియోగించింది.
బుధవారం (మే 7) రాత్రి బార్డర్ లోని పంజాబ్, జమ్మూ కశ్మీర్ ప్రాంతాలపై వరుస దాడులకు దిగింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్ము, అమృత్ సర్, కపుర్తల, జలంధర్, లుధియానా, అదంపూర్ , భతిండా, చండీఘర్, నల్, ఫలోడీ, ఉత్రలై, భూజ్ మొదలైన కీలక ప్రాంతాలపై దాడులకు దిగింది. UAS గ్రిడ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో మిస్సైల్స్, డ్రోన్స్ లను న్యూట్రలైజ్ చేసింది ఇండియన్ ఆర్మీ.
పాక్ రాడార్ సిస్టమ్ ను ధ్వంసం చేసిన ఇండియా:
పాక్ దాడికి బదులుగా గురువారం (మే 8) ఉదయం పాకిస్తాన్ లోని పలు ప్రాంతాలలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ రాడార్ సిస్టమ్స్ ను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. పాక్ ఎంత తీవ్రతతో ఇండియాపై మిస్సైల్స్ ప్రయోగించిందో అంతే తీవ్రతతో అంతకు మించిన వేగంతో రాడార్ సిస్టమ్స్ ను ధ్వంసం చేసింది.
గురుద్వారలో 8 గంటల బ్లాకౌట్:
పంజాబ్ ను పాక్ టార్గెట్ చేస్తుండటంతో ఆర్మీ అలర్ట్ అయ్యింది. శత్రువులకు టార్గెట్స్ కనిపించకుండా ఉండేందుకు గురుద్వారలో రాత్రంతా బ్లాకౌట్ నిర్వహించారు. విద్యుత్ వ్యవస్థలను మొత్తం ఆపేసి బ్లౌకౌట్ ప్రకటించారు. మే 7, బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 5 గంటల వరకు కరెంటును నిలిపివేశారు. అదేసమయంలో పాక్ ప్రయోగిస్తున్న మిస్సైల్స్ ను ఆర్మీ చాకచక్యంగా విచ్ఛిన్నం చేసింది. పాక్ మిస్సైల్స్ ప్రయోగిస్తుండటంతో గురుద్వారలోని కొన్ని ప్రాతాలు ఖాలీ చేయిస్తు్న్నారు.
►ALSO READ | భారత్ భారీ విజయం.. ఆపరేషన్ సిందూర్లో జేఎం మాస్టర్ మైండ్ అబ్దుల్ రవూఫ్ అజార్ హతం