ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌లో గుడి కట్టండి: పాక్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోరిన హిందువులు

ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌లో గుడి కట్టండి: పాక్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోరిన హిందువులు

ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌: పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ కేపిటల్‌‌‌‌‌‌‌‌ ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌లో దేవాలయాన్ని కట్టాలని  హిందూ మైనార్టీలు ప్రభుత్వాన్ని కోరారు. ఫెడరల్‌‌‌‌‌‌‌‌ కేపిటల్‌‌‌‌‌‌‌‌లో ఒక్క ఆలయం కూడా లేదని హిందూ పంచాయత్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ మహేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. దేవుడ్ని ప్రార్థించేందుకు, పూజలు చేసేందుకు ఒక సొంత ప్లేస్‌‌‌‌‌‌‌‌ ఉండటం  రాజ్యాంగపరమైన హక్కు అని చెప్పారు. కేపిటల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అథారిటీ బోర్డు 2016లో 2వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించి, నో అబ్జక్షన్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికేట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిందని, డబ్బులు లేక గుడి కట్టుకోలేదని కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు.