వీడియో : నవ్వొద్దు.. సీరియస్.. చంద్రుడిపైకి మనిషిని పంపిన పాకిస్థాన్

వీడియో : నవ్వొద్దు.. సీరియస్.. చంద్రుడిపైకి మనిషిని పంపిన పాకిస్థాన్

చంద్రయాన్-3 ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండయి చరిత్ర సృష్టించింది. ఈ చరిత్రాత్మక సంఘటనపై పాకిస్థాన్ స్పందనను ప్రపంచం గమనించకుండా ఉండలేకపోయింది. ఇది తక్షణమే సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. పాకిస్థానీయులు తాము ఇప్పటికే చంద్రునిపై జీవిస్తున్నట్లు భావించామని సరదాగా చెప్పుకోవడం నుంచి వారి వార్తా ఛానెల్‌లు పెద్దగా ఆలోచించకుండా చిన్న విషయాలకు చెమటలు పట్టించినందుకు తోటి దేశస్థులను తిట్టడం వరకు, ఇంటర్నెట్ హాస్యం, ఉత్సాహంతో సందడి చేస్తోంది.  

'X'లో షేర్ అవుతోనన ఓ టిక్‌టాక్ వీడియోలో, ముగ్గురు వ్యక్తులు.. ఓ వ్యక్తిని చంద్రునిపైకి పంపినట్లు భావించారు. ఓ ల్యాబ్ నుంచి వారు పనిచేస్తున్నట్లు కనిపించారు. రాకెట్‌తో పంపిన వ్యక్తి టేకాఫ్ సమయంలో హాస్యాస్పదంగా దాన్ని జారవిడుచుకోవడంతో వీడియో ప్రారంభం నుంచి నవ్వులతో నిండిపోయింది. ల్యాబ్‌లో పనిచేస్తున్న వ్యక్తుల్లో ఒకరు అతనికి భరోసా ఇస్తూ, “సమస్య లేదు, అక్కడికి చేరుకునే శక్తి మీకు ఉంది” అని అన్నారు. ఆ తర్వాత వచ్చిన VFX ఎడిటింగ్‌లో ఆ వ్యక్తి భూమి నుంచి పైకి ఎగురుతున్నట్లు చూపించింది. అంతలోనే ల్యాప్ టాప్ ను ఆపరేట్ చేస్తోనన ఓ వ్యక్తి  నమ్మకంగా, "అది జరగదు" అని అన్నాడు. "మనం ఎప్పటికీ చంద్రుడిని చేరుకోలేమని భారతదేశం భావించింది" అని చెప్పాడు. అలా నసీర్ ఫైనల్ గా  చీకటిలో ఎక్కడో ఊహించని విధంగా తన యాత్రను ముగించినట్లు వెల్లడించాడు. ఆపరేటర్ వెంటనే.. నసీమ్ నరకానికి చేరుకున్నాడని చెప్పాడు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌గా మారింది. దీంతో ప్రతిచోటా నవ్వులు వ్యాపించాయి.  భారతదేశంలో టిక్‌టాక్ నిలిపివేయడంతో, ఈ వీడియో చంద్రయాన్-3 ల్యాండింగ్‌కు ముందుదా లేదా తర్వాత సృష్టించబడిందా అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.