మహిళా జడ్జికి మళ్లీ సారీ చెప్పిన ఇమ్రాన్

మహిళా జడ్జికి మళ్లీ సారీ చెప్పిన ఇమ్రాన్

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధా ని ఇమ్రాన్ ఖాన్ మరోసారి మహిళా జడ్జికి క్షమాపణలు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో చేసిన ఒక ప్రసంగం లో ఇమ్రాన్‌ఖాన్.. ఇస్లామాబాద్‌ లోని పోలీస్​ ఉన్నతాధికారులను, జడ్జి జెబా చౌదరీని బెదిరించారు. తన పార్టీ నేత షాబాజ్ గిల్‌ను వేధించారని ఆరోపిస్తూ.. పోలీస్​ అధికారులపై, జడ్జీపై ఫిర్యాదు చేస్తా నని, ఎవ్వరిని వదలబోనని బెదిరిం చాడు. 

దాంతో ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. బుధవారం ఈ కేసు విచారణ సందర్భంగా  ఇమ్రాన్ ఖాన్ సెషన్స్ కోర్టుకు హాజర య్యారు. తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని జడ్జితో అన్నారు.