ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధా ని ఇమ్రాన్ ఖాన్ మరోసారి మహిళా జడ్జికి క్షమాపణలు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్లో చేసిన ఒక ప్రసంగం లో ఇమ్రాన్ఖాన్.. ఇస్లామాబాద్ లోని పోలీస్ ఉన్నతాధికారులను, జడ్జి జెబా చౌదరీని బెదిరించారు. తన పార్టీ నేత షాబాజ్ గిల్ను వేధించారని ఆరోపిస్తూ.. పోలీస్ అధికారులపై, జడ్జీపై ఫిర్యాదు చేస్తా నని, ఎవ్వరిని వదలబోనని బెదిరిం చాడు.
దాంతో ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. బుధవారం ఈ కేసు విచారణ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ సెషన్స్ కోర్టుకు హాజర య్యారు. తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని జడ్జితో అన్నారు.