పాకిస్తాన్​ సబ్సిడీలను సగానికి తగ్గించుకోవాలె : ఐఎంఎఫ్

పాకిస్తాన్​ సబ్సిడీలను సగానికి తగ్గించుకోవాలె :  ఐఎంఎఫ్
  • పాకిస్తాన్​కు ఐఎంఎఫ్ కండిషన్లు

ఇస్లామాబాద్: పాకిస్తాన్​కు ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) రివ్యూ మిషన్​ షాక్​ ఇచ్చింది. కరెంట్ చార్జీలు యూనిట్​కు 11 నుంచి 12.5 ​రూపాయలు పెంచాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు సబ్సిడీని 335 బిలియన్ల రూపాయలకు పరిమితం చేయాలని కండిషన్​ పెట్టింది. అప్పుడే అదనపు నిధులు ఇస్తామని చెప్పింది. పాక్​​ సమర్పించిన రివైజ్డ్​ సర్క్యులర్​ డెట్​ మేనేజ్​మెంట్ ప్లాన్(సీడీఎంపీ)ను రిజెక్ట్​ చేసింది. నాథన్ పోర్టర్ నేతృత్వంలోని ఐఎంఎఫ్​ రివ్యూ మిషన్ ఇస్లామాబాద్​లో పర్యటిస్తోంది. 7 బిలియన్ డాలర్ల ఎక్స్‌‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ(ఈఎఫ్ఎఫ్)కి సంబంధించి పెండింగ్‌‌లో ఉన్న 9వ సమీక్షను పూర్తి చేయడానికి ఇరు వర్గాలు చర్చలు జరుపుతున్నాయి. 

రియలిస్టిక్​గా లేదు..

సవరించిన సీడీఎంపీ రియలిస్టిక్​గా లేదని, ఇది తప్పుడు అంచనాలతో రూపొందిందని ఐఎంఎఫ్​ పేర్కొంది. విద్యుత్ రంగ నష్టాలను నియంత్రించడానికి పాక్ ప్రభుత్వం తన పాలసీల్లో మార్పులు చేయాలని తెలిపింది. త్వరలో ప్రవేశపెట్టబోయే మినీ బడ్జెట్​లో ఉన్న లోటును భర్తీ చేసేందుకు అదనపు పన్నులు వేయడంపై ఐఎంఎఫ్, పాక్​ రక్షణ శాఖ కలిసి చర్చలు జరుతున్నాయి. రివైజ్డ్​ సీడీఎంపీ ప్రకారం.. సర్క్యులర్​ డెట్​ను 952 బిలియన్ పాకిస్తాన్ రూపాయలకు పెంచాలని పాక్​ ఐఎంఎఫ్​ను కోరింది. 2023 మొదటి రెండు క్వార్టర్లలో విద్యుత్​ టారిఫ్ సర్దుబాటు ద్వారా యూనిట్‌‌ టారిఫ్​ను 7 ​ రూపాయలకు పెంచామని, జూన్ నుంచి మొదలయ్యే మూడో క్వార్టర్​కు 1.64 రూపాయలు పెంచుతామని, అయినాసరే తమకు 675 బిలియన్ల రూపాయల అదనపు సబ్సిడీ అవసరమని సీడీఎంపీలో వివరించింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు సబ్సిడీ అవసరాలను 675 బిలియన్ల ​ రూపాయలకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా లెక్కించిందనే దానిపైనా ఐఎంఎఫ్ ప్రశ్నలు వేసింది.