వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం

వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం

పిట్లం, వెలుగు: పల్లె గోస– బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా శనివారం పిట్లంకు వచ్చిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామికి పిట్లం కార్యకర్తలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం పిట్లం వచ్చిన ఆయన సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు బెజుగం చంద్రశేఖర్, జిల్లా ప్రెసిడెంట్ అరుణతార, మాజీ జడ్పీ చైర్మన్‌‌‌‌ కాటేపల్లి వెంకటరమణరెడ్డి ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సెక్రటరీలు కాలకుంట్ల రాము, తేలు శ్రీనివాస్​, పిట్లం ప్రెసిడెంట్ అభినయ్‌‌‌‌రెడ్డి, ఓబీసీ జిల్లా వైస్​ప్రెసిడెంట్ అశోక్‌‌‌‌రాజ్‌‌‌‌, పిట్లం సెక్రటరీ సాయిరెడ్డి పాల్గొన్నారు.