సంగారెడ్డి జిల్లాలో మోకాళ్లపై నిలబడి ఈ పంచాయతీ ఆపరేటర్ల సమ్మె

సంగారెడ్డి జిల్లాలో మోకాళ్లపై నిలబడి ఈ పంచాయతీ ఆపరేటర్ల సమ్మె

సంగారెడ్డి టౌన్, వెలుగు : పనికి తగ్గ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ పంచాయతీ మేనేజర్ ఆపరేటర్లు చేస్తున్న సమ్మె 5వ రోజుకు చేరుకుంది. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆపరేటర్స్ జిల్లా అధ్యక్షుడు సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ డిపార్ట్​మెంట్​లో

32 మంది డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్లు, 9 ఏళ్లుగా ఈ పంచాయతీ ఆపరేటర్స్ 1619 మంది పని చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం వినోద్ కంప్యూటర్ ఆపరేటర్స్ విజయ్ కుమార్, కృష్ణ, సాయినాథ్, నరసింహ, సతీశ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.