హైదరాబాద్‌‌‌‌లో పీ అండ్​ ఎస్ స్టోర్​ ప్రారంభం

హైదరాబాద్‌‌‌‌లో పీ అండ్​ ఎస్ స్టోర్​ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: ప్రీమియం కిడ్స్ ఎథ్నిక్ వేర్ బ్రాండ్, తెలంగాణలో తన మొదటి ప్రత్యేక స్టోర్‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌లో ప్రారంభించింది. తమ బ్రాండ్, పిల్లల కోసం సంప్రదాయం, ఆధునికతను కలిపి అందమైన దుస్తులను తయారు చేస్తుందని కంపెనీ కో–ఫౌండర్లు తెలిపారు. కోల్‌‌‌‌కతా వెలుపల తొలిసారిగా ఏర్పాటు చేసిన స్టోర్​ ఇదేనని చెప్పారు.  గ్రాన్యూల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రియాంక చిగురుపాటి ఈ స్టోర్‌‌‌‌ను లాంఛనంగా ప్రారంభించారు. 

చిన్నారుల ఫ్యాషన్‌‌‌‌లో కట్, ఫిట్, క్వాలిటీ, కంఫర్ట్ చాలా ముఖ్యమని ఆమె అన్నారు.  అంబానీలు, పిరమల్స్, అదానీలు, జీవీకేలు వంటి అనేక ప్రముఖ భారతీయ కుటుంబాల పిల్లలు, అలాగే షాహిద్ కపూర్, అనుష్క శర్మ వంటి బాలీవుడ్ ప్రముఖులు, జస్‌‌‌‌ప్రీత్ బుమ్రా వంటి క్రికెట్ స్టార్లు కూడా తమ బ్రాండ్ దుస్తులను ధరిస్తారని పీ అండ్​ఎస్​తెలిపింది.