అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నందుకే హత్య ..పరకాల మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నందుకే హత్య ..పరకాల మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

పరకాల, వెలుగు: పరకాలలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని వెల్లడించారు. శుక్రవారం పరకాల పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో ఏసీపీ సతీశ్​బాబు కేసు వివరాలను వెల్లడించారు. 

నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన ఎండీ షరీఫొద్దీన్, భార్య అజీరాబేగంతో కలిసి పరకాల పట్టణంలోని సాగరవీధిలో అద్దెకు ఉంటున్నారు. పట్టణంలోని ఓ టిఫిన్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో పనిచేసే జట్టబోయిన సందీప్‌‌‌‌తో పరిచయం ఏర్పడింది. దీంతో పలుమార్లు ఇంటి వద్దకు టిఫిన్లు తీసుకురావాలని సందీప్‌‌‌‌ను పంపుతుండటంతో అతనికి అజీరాబేగంతో పరిచయం ఏర్పడి, అక్రమ సంబంధానికి దారితీసింది. 

ఈ నెల 2న సందీప్‌‌‌‌, షరీఫొద్దీన్‌‌‌‌  వెల్లంపల్లి రోడ్డుకు వెళ్లి మద్యం సేవించారు. ఆ సమయంలో వివాహేతర సంబంధం విషయం ప్రస్తావనకు రావడంతో సందీప్‌‌‌‌ కర్రతో షరీఫొద్దీన్‌‌‌‌ తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు డెడ్​బాడీని బైక్​పై ప్రధాన రహదారికి తరలించాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సందీప్‌‌‌‌ ను విచారించగా నేరం ఒప్పుకున్నాడు. శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌కు తరలించారు.