తగ్గిన బండ్ల అమ్మకాలు.. మేలో 10,38,824 యూనిట్లు అమ్ముడవగా..

తగ్గిన బండ్ల అమ్మకాలు.. మేలో 10,38,824 యూనిట్లు అమ్ముడవగా..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత ఏడాది మే నెలలో అమ్మకాలు 3,47,492 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో దేశీయ ప్యాసింజర్ వెహికల్స్ హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్స్​ స్వల్పంగా 0.8 శాతం తగ్గి 3,44,656 యూనిట్లకు చేరుకున్నాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. మే నెలలో తయారీదారుల నుంచి డీలర్లకు టూవీలర్స్ పంపకాలు 2.2 శాతం పెరిగి 16,55,927 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 16,20,084 యూనిట్లను అమ్మారు. అన్ని కేటగిరీలలో మొత్తం హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్స్​ 1.8 శాతం పెరిగి 20,12,969 యూనిట్లకు చేరుకున్నాయి.

గత ఏడాది మే నెలలో 19,76,674 యూనిట్లు అమ్ముడుపోయాయి. ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) విభాగం అమ్మకాలు 0.8 శాతం తగ్గి, మే నెలలో 3.45 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. మోటార్ సైకిల్ అమ్మకాలు గత నెలలో 10,38,824 యూనిట్లు అమ్ముడవగా,  మే 2024లో 10,39,156 యూనిట్లు సేల్​అయ్యాయి. స్కూటర్ల అమ్మకాలు గత నెలలో 7.1 శాతం పెరిగి 5,79,507 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీ వీలర్ అమ్మకాలు గత నెలలో 3.3 శాతం తగ్గి 53,942 యూనిట్లకు చేరుకున్నాయి.