రైల్వే స్టేషన్‌‌లో ట్రైన్ నెట్టిన పాసింజర్స్

రైల్వే స్టేషన్‌‌లో ట్రైన్ నెట్టిన పాసింజర్స్

సాధారణంగా బైక్ ఆగిపోతే నెట్టుకుంటే వెళ్తుంటాం. అలాగే అప్పుడప్పుడు కార్,జీపు లాంటివి ట్రబుల్ ఇస్తే... తోసుకుంటే రిపేర్ షాపుకు పోతుంటాం. కొన్ని అరుదైన సందర్భాల్లో బస్సుల్ని కూడా జనం నెట్టడం చూశాం. కానీ తాజాగా ఓ రైలును ప్రయాణికులు నెట్టారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది మీరట్ సమీపంలోని దౌరాలా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. సహరాన్‌పూర్-ఢిల్లీ రైలు ఇంజన్‌తో పాటు రెండు కంపార్ట్‌మెంట్లలో మంటలు చెలరేగాయి. దీంతో ఆ రైలులో ప్రయాణిస్తున్న వారంతా ఒక్కసారిగా ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమై ట్రైన్ నుంచి దిగేశారు. మంటలు చెలరేగిన ఇంజన్, రెండు కంపార్ట్‌మెంట్ల నుండి మిగిలిన రైలు కంపార్ట్‌మెంట్లను వేరు చేయడానికి ప్రయాణికులంతా కలిసి రైలును నెట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

ఇవి కూడా చదవండి:

సమతామూర్తి విగ్రహంపై నారాయణ కీలక వ్యాఖ్యలు

మోడీజీ ప్లీజ్ హెల్ప్... కశ్మీరీని పెళ్లాడిన ఉక్రెయిన్ యువతి