- ఏండ్ల నుంచి ప్రతిపాదనలు ఉన్నా కార్యరూపం దాల్చట్లేదు
- రోజురోజుకూ పబ్లిక్ట్రాన్స్పోర్డుకు పెరుగుతున్న ప్రయారిటీ
- సిటీలో ప్యాసింజర్ల నుంచి అధికారులకు విజ్ఞప్తులు
- మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీలో ఒకే కార్డుతో ఈజీ జర్నీ
హైదరాబాద్, వెలుగు: సిటీలో పబ్లిక్ట్రాన్స్ పోర్ట్ ను వినియోగించుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆర్టీసీ, మెట్రోరైల్, ఎంఎంటీఎస్ఇలా తమకు అందుబాటు ఉన్న సౌకర్యాన్ని ప్రస్తుతం వినియోగించుకుంటున్నారు. కానీ ప్రతి ప్రయాణానికి వేరుగా పాస్ ఉంటుండగా ఇబ్బందిగా మారింది. దీంతో కామన్మొబిలిటీ కార్డును తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఒకే కార్డుతో మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ ఇలా పబ్లిక్ట్రాన్స్పోర్టులో ప్రయాణించే వీలుంటుంది. స్టూడెంట్స్, ఉద్యోగుల నుంచి సీఎంసీకి డిమాండ్పెరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా కామన్ మొబిలిటీ కార్డు తెచ్చేందుకు ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్సంస్థలతో సమావేశాలు నిర్వహించారు. కానీ ఆ ప్రతిపాదనలు ఏండ్లుగా కార్యరూపంలోకి రావడంలేదు.
భవిష్యత్ లో మరింత ప్రయారిటీ
ఇప్పటికే మహాలక్ష్మి స్కీమ్ద్వారా ఆర్టీసీలో ప్రయాణించేవారు పెరిగారు. మెట్రో, ఎంఎంటీఎస్ల్లోనూ ప్యాసింజర్ల సంఖ్య అధికంగానే ఉంటుంది. సిటీలో ప్రస్తుతం ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్లో కలిపి రోజుకు దాదాపు 25 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. అలాగే సిటీలో బస్సు సర్వీసులను కూడా ఆర్టీసీ పెంచుతోంది. మెట్రోను ఎంజీబీఎస్నుంచి ఫలక్నుమా వరకు విస్తరించేందుకు ఇటీవలే ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. దీంతో రాబోయే రోజుల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టుకు మరింత ప్రయారిటీ పెరగనుంది. దీంతో కామన్ మొబిలిటీ కార్డును కూడా తేవాలని ప్రయాణికులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. సీఎంసీ ద్వారా పబ్లిక్ట్రాన్స్పోర్ట్ మాత్రమే కాదు. పార్కింగ్, షాపింగ్, ఆన్ లైన్ లావాదేవీలకు బ్యాంకు కార్డుగా వాడుకునే వీలు ఉంటుంది.
మహాలక్ష్మి కార్డు తెస్తామనగా..
ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్ను అమలులోకి తీసుకొచ్చినప్పుడు మహిళా ప్రయాణికులకు ప్రత్యేకంగా ఒక కార్డును తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ప్రస్తుతం ఆధార్కార్డుతోనే స్కీమ్ను కొనసాగిస్తోంది. కామన్మొబిలిటీ కార్డు తీసుకొస్తే మహాలక్ష్మి స్కీమ్తో పాటు మిగతా ప్రయాణికులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఆ దిశగా ఆర్టీసీ అధికారులు ఆలోచన చేయాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.