
హైదరాబాద్, వెలుగు: టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్కు చెందిన ‘క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్ (సీఏపీ)’ని హైదరాబాద్లో మంగళవారం ప్రారంభించారు. యూసుఫ్ పఠాన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. యంగ్స్టర్స్కు వరల్డ్ క్లాస్ కోచింగ్ అందించి వారిని అత్యుత్తమ క్రికెటర్లుగా తయారు చేయడమే సీఏపీ లక్ష్యమని యూసుఫ్ తెలిపాడు. ఇప్పటికే 25 నగరాల్లో క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్ సెంటర్లుండగా హైదరాబాద్లో స్టార్ట్ చేసింది వీటికి అదనం. అయితే ఈ ఏడాది పూర్తయ్యే లోపు మరో 25 నగరాల్లో తమ అకాడమీలు ఏర్పాటు చేస్తామని సీఏపీ ఎండీ హర్మీత్ వాస్దేవ్ తెలిపారు.
For More News..