పాకిస్తాన్​లో బ్రో సినిమా ట్రెండింగ్​

పాకిస్తాన్​లో బ్రో సినిమా ట్రెండింగ్​

పవన్​ కల్యాణ్​, సాయిధరమ్​ తేజ్​ నటించిన ‘బ్రో’ సినిమా పాకిస్తాన్​లో ట్రెండింగ్​గా మారింది. ఒక్క పాక్​లోనే కాదు బంగ్లాదేశ్​లోనూ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్​ వస్తోంది. ఇటీవల బ్రో సినిమా ఓటీటీలో రిలీజ్​ అయిన సంగతి తెలిసిందే. 

లేటెస్ట్​గా ఆగస్టు 21 నుంచి 27 వరకు నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఈ మూవీ ఇండియాలో నం.1 స్థానంలో ఉంది. నాన్‌ ఇంగ్లిష్‌ సినిమాల లిస్ట్‌లో టాప్‌7లో నిలిచింది. అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో టాప్‌ 8లో ఉంది. 

ఇందుకు సంబంధించిన పోస్టర్లు నెట్టింట వైరల్​గా మారాయి. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ మూవీకి త్రివిక్రమ్​ డైలాగ్స్​, స్క్రీన్​ప్లేను అందించారు