ప్రాణ త్యాగాలు వద్దు.. ప్లకార్డులు పట్టుకోండి చాలు 

ప్రాణ త్యాగాలు వద్దు.. ప్లకార్డులు పట్టుకోండి చాలు 

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైఎస్సార్ సీపీ ఎంపీలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చురకలు అంటించారు. ప్రాణ త్యాగాలు చేసైనా సరే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని రీసెంట్ గా జరిగిన వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ నేతలు చెప్పారని పవన్ గుర్తు చేశారు. ప్రాణ త్యాగాలు అక్కర్లేదు గానీ.. కనీసం ప్లకార్డులు పట్టుకోండి చాలని ట్వీట్ చేశారు. రైజ్ ప్లకార్డ్స్ వైఎస్సార్ సీపీ ఎంపీ అనే హ్యాష్ ట్యాగ్ ను ఈ ట్వీట్ కు జత చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్లకార్డులు పట్టుకోవాలన్నారు. 

కాగా, జనసేనాని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ గళం వినిపిస్తున్నారు. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి ఆయన మద్దతు ప్రకటించారు. ఇప్పటికే ప్రత్యక్ష పోరాటానికి దిగిన పవన్.. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సోషల్‌ మీడియా వేదికగా డిజిటల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

మీ పొట్టలు నిండాలి.. మా పొట్టలు ఎండాల్నా?

ఇకపై గాంధీలో జినోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు

చావు డప్పు.. కొనసాగుతున్న నిరసనలు