తెలంగాణలో బలపడుతున్నం.. బీఆర్ఎస్ తో  పొత్తు ప్రశ్నేలేదు : పవన్ ఖేరే

తెలంగాణలో బలపడుతున్నం..  బీఆర్ఎస్ తో  పొత్తు ప్రశ్నేలేదు : పవన్ ఖేరే
  • బీఆర్ఎస్ తో  పొత్తు ప్రశ్నేలేదు
  • తెలంగాణలో బలపడుతున్నం
  • సీఎం ఎవరనే నిర్ణయం సీఎల్పీదే
  • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన
  • ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరే

తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రశ్నేలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ భేరే అన్నారు. కర్నాటక తరహాలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ బలపడుతున్నదన్నా రు. ప్రజానుకూల ఎజెండాతో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎ స్ తోనూ తమ ఎన్నికల పోరాటమని చెప్పారు. ఇవాళ బేగంపేటలోని కంట్రీ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ మొదట తెలంగాణలో వంద సీట్లు గెలిచాక ప్రధానమంత్రి పదవి గురించి మాట్లాడాలన్నారు.

తెలంగాణలో ఎన్నికల మేనిఫేస్టోను స్థానిక నేతలే నిర్ణయిస్తారని చెప్పారు. ఇక్కడి సమస్యలపై వాళ్లకే ఎక్కువగా అవగాహన ఉంటుందన్నారు. బీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టడం ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ బాధ్యత అన్నారు.కేంద్రం తప్పుడు విధానాలపై తమ పోరాటం సాగుతుందని ఆయన చెప్పారు. విద్వేష ప్ర సంగాలపై చర్యలు తీసుకోవాలని ఇదివరకే సుప్రీంకోర్టు చెప్పిందని, ఆ మేరకే కర్నాటకలో బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కర్నాటక మేనిఫెస్టోలో పెట్టినట్టు పవన్ ఖేరే చెప్పారు.

తెలంగాణలో సీఎం ఎవరుండాలనేది సీఎల్పీ నిర్ణయిస్తుందన్నారు. సరైన సమయంలో ఏఐసీసీ సరైన నిర్ణయం తీసుకుంటుందన్నా రు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్ద పీట వేస్తుందని, తామపార్టీ ప్రభుత్వం అధికారం లోకి రాగానే కులగణన చేపడుతుందని ఖేరే చెప్పారు.