వైసీపీ, బీజేపీ పొత్తుపై పవన్ క్లారిటీ..

వైసీపీ, బీజేపీ పొత్తుపై పవన్ క్లారిటీ..

వైసీపీ, బీజేపీ పొత్తు ఉండదన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.  రాయపూడి గ్రామంలో రైతుల దీక్షా శిబిరంలో మాట్లాడిన పవన్..రాజధానిగా అమరావతి కోసం జనసేన బీజేపీ  ఉమ్మడి పోరాటం కొనసాగుతుందన్నారు. అమరావతి సాధించే వరకు పోరాడతానన్నారు. తాను ప్రత్యేకంగా జై అమరావతి అనక్కర్లేదని.. ఎందుకంటే అమరావతి సాధించాలనే తపన తన మనసులో ఉందన్నారు. అందుకే రైతులకు మద్ధతుగా ఇక్కడికి వచ్చానన్నారు. అమరావతి రైతులు జై అమరావతి కాకుండా జై ఆంద్రా అనాలన్నారు. అమరావతి ఉద్యమానికి కులం ,ప్రాంతం అంటగట్టి వైసీపీ రాజకీయం చేస్తుందన్నారు. ఎన్జీఏలో  వైసీపీ చేరుతుందన్నవార్తలు చూసి ప్రదాని మోదీ, అమిత్ షాలను తప్పుగా అనుకోవద్దన్నారు. సీఎం జగన్ వెళ్లి  మోదీ, అమిత్ షాలను కలిస్తే ఏమి జరగదన్నారు.

see more news

చిరంజీవి ఫస్ట్ మూవీ డైరెక్టర్ మృతి

నితిన్ ఇంట పెళ్ళి బాజా..

బోల్ట్ రికార్డ్ బద్దలు కొట్టిన కన్నడ వీరుడు..9.55 సెకన్లలో 100 మీటర్లు

చనిపోయినా మరో ఐదుగురికి ప్రాణం పోసింది