టీఆర్ఎస్ ఫ్లెక్సీల్లో రేవంత్ రెడ్డి ఫోటో

టీఆర్ఎస్ ఫ్లెక్సీల్లో రేవంత్ రెడ్డి ఫోటో
  • మంత్రిని ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకుడు

హైదరాబాద్: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఫోటో ఉండడం కలకలం రేపింది. మంత్రి రాక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో రేవంత్ రెడ్డి ఫోటోలు కనిపించీ కనిపించకుండా ఉంది. అయితే ఓ కాంగ్రెస్ నాయకుడు గట్టిగా ప్రశ్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అనుచరులతో కలసి నిరసనకు ప్రయత్నించగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని దూరంగా తీసుకెళ్లడంతో మంత్రి కార్యక్రమం నిరాటంకంగా జరిగింది. మేడ్చల్ మండలం పరిధిలోని ఎల్లంపేట్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంగా సందర్భంగా జరిగిందీ ఘటన. 
శుక్రవారం మేడ్చల్ జిల్లా పరిధిలోని ఎల్లంపేట గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో (బ్యానర్లలో) పీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. ఆయన ప్రతిపక్ష పార్టీ  నాయకుడైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అన్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం పై కాంగ్రెస్ నాయకులు మంత్రి నిలదీశారు. ప్రోటోకాల్  పాటించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఫోటో కనబడకుండా టీఆర్ఎస్ నాయకులు జాగ్రత్తలు తీసుకున్నా కాంగ్రెస్ నాయకుడు మంత్రిని ప్రశ్నించడంతో గొడవ తలెత్తింది. పోలీసులు  ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకుడిని అదుపులోకి  తీసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.