జూబ్లీహిల్స్ లో గెలిచి తీరుతాం: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్

జూబ్లీహిల్స్ లో గెలిచి తీరుతాం: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడమే కాదు, తప్పకుండా విజయం సాధిస్తుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలపై కీలక నిర్ణయాలు తీసుకోవడంతోపా టు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించేం దుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశా లు నిర్వహించనున్నట్టు చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇది గోల్డన్ పీరియడ్ అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఉంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. 

దేశ చరిత్రలో అదో హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా.. శిక్ష తప్పదని అన్నారు.  కాళేశ్వరంతో పాటు పలు కుంభకోణాలను వెలు గుతీసి ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లఅమలుపై కాంగ్రెస్ పార్టీ చర్చించి నిర్ణయం ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ నేతలు నోరు మెదపడం లేదని కామెంట్ చేశారు. మూడు ముక్కలాటతో బీఆర్ఎ స్ పార్టీ ఖేల్ ఖతం అయిందన్నారు. 

కవిత చెప్పిన ట్టు బీఆర్ఎస్లో దెయ్యాలుంటే.. కాంగ్రెస్లో దేవత లున్నారని కామెంట్ చేశారు. మహిళల అభివృద్ధి గురించి కవిత మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య. కవితకు మద్దతు మాట్లాడటం విచారకరమని పేర్కొన్నారు. బనకచర్లతో రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరకోబోమని.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టుకో మని జీవోలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని మండిపడ్డారు. కృష్ణా జలాల విషయంలో హరీశ్ రావు సంతకం ఎందుకు పెట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అభూత కల్పనతో బీఆ ర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వ్యవస్థను నడుపు తున్నారని.. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.