మోడీ ఎజెండాను కేసీఆర్ అమలు చేస్తుండు

మోడీ ఎజెండాను కేసీఆర్ అమలు చేస్తుండు

వికారాబాద్ జిల్లా కొడంగల్ లో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. కేంద్రంలో.. మోడీ వరి వద్దంటున్నారని.. ఇక్కడ కేసీఆర్ కూడా అదే విషయాన్ని చెప్తున్నారన్నారు. మోడీ ఎజెండాను ఇక్కడ కేసీఆర్ అమలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. సెప్టెంబర్ లో ప్రధాని మోడీని కేసీఆర్ కలిసొచ్చిన తర్వాత.. ఏ కేంద్రమంత్రి అపాయింట్‌మెంట్ కూడా తీసుకోలేదని చెప్పారు. ప్రభుత్వాలను అడిగితేనే అనుమతులు వస్తాయని, ఊరికే ఢిల్లీ వెళ్లొస్తే ఏం వస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో వడ్లు కొనకపోవడంతోనే రైతులు చనిపోతున్నారని, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు సహకరించాలని, టీఆర్ఎస్ ఎంపీలు తమను కోరలేదన్నారు రేవంత్. సీఎం  సహాయ నిధితో కూడా వడ్లు కొనొచ్చని సూచించారు. కరోనా సమయంలో ప్రభుత్వం ఖర్చులు చూపడం లేదని.. భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు రేవంత్.