వచ్చే ఏడాది మార్చిలోనే ఎన్నికలొస్తయ్

వచ్చే ఏడాది మార్చిలోనే ఎన్నికలొస్తయ్

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  ప్రతీ బూత్ లో మెజారిటీ సభ్యత్వం నమోదు చేయాలన్నారు. బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు రేవంత్.. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..  తెలంగాణలో సోనియమ్మ రాజ్యం తెస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక డివిజన్లో మీరు చెప్పిన వారికే  పథకాలు అమలు చేస్తామన్నారు.  పేదలకు ఇళ్లు, పించన్లు ఇస్తామన్నారు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని..పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఈ ఏడాది డిసెంబర్ లో అసెంబ్లీని రద్దు చేసి  వచ్చే ఏడాది మార్చిలో  ఎన్నికలకు వెళ్తాడన్నారు. కేసీఆర్ కు రోజులు దగ్గరపడ్డాయన్నారు. కేసీఆర్ ఆత్మహత్య చేసుకోవడానికి కేసీఆర్ అన్ని రెడీ చేసుకుంటున్నాడన్నారు రేవంత్. 

మరిన్ని వార్తల కోసం..

రైల్వే స్టేషన్‌‌లో ట్రైన్ నెట్టిన పాసింజర్స్