రేవంత్ రెడ్డిని కలిసిన  పద్మశాలి నేతలు

రేవంత్ రెడ్డిని కలిసిన  పద్మశాలి నేతలు

హైదరాబాద్, వెలుగు : పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం(టీఆర్పీఎస్​) నేతలు కలిశారు. రాజకీయంగా తమకు అవకాశం కల్పించాలని కోరారు. 20 వేల నుంచి 75 వేల వరకు పద్మశాలిలు ఓటర్లుగా ఉన్న నియోజకవర్గాల వివరాలను రేవంత్ కు అందజేశారు.

టీఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న జరిగిన పద్మశాలి రాజకీయ యుద్ధభేరి మహాసభ తీర్మానం మేరకు వివిధ పార్టీల అధ్యక్షులను కలుస్తున్నామని  టీఆర్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ  శ్రీనివాస్ పేర్కొన్నారు. రేవంత్ ను కలిసిన వారిలో  బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, పీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్, వేముల బాలరాజు తదితరులు ఉన్నారు.