- రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నడు
- గన్ పార్క్ వద్ద పీసీసీ కార్యదర్శి కురువ విజయ్ కుమార్ ఆందోళన
బషీర్ బాగ్, వెలుగు : గద్వాల ఎమ్మెల్యే టికెట్ ను రూ.10 కోట్లు, 5 ఎకరాల భూమికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడని పీసీసీ కార్యదర్శి కురువ విజయ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద ఆందోళన చేపట్టారు. ‘నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు నోటు’ అంటూ తన అనుచరులతో కలిసి నినాదాలు చేశారు. 65 సీట్లను రూ.600 కోట్లకు రేవంత్అమ్ముకున్నారని ఆరోపించారు. రేవంత్ వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతోందన్నారు. రేవంత్ అక్రమాలపై ఈడీ, ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని
హెచ్చరించారు.
విజయ్, కలీం బాబా సస్పెన్షన్
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ కురువ విజయ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆదివారం గాంధీభవన్లో రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసిన బహదూర్పురా యాస్పిరెంట్ కలీమ్ బాబాను కూడా సస్పెండ్చేసింది. ఎవరు రూల్స్ ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చింది.