హైదరాబాద్, వెలుగు: విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న కలెక్టరేట్ల ఎదుట నిరసనలు చేపట్టనున్నట్లు టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చకినాల అనిల్ కుమార్, నన్నెబోయిన తిరుపతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రూ. 3.24 లక్షల కోట్ల బడ్జెట్లో విద్యారంగానికి కేవలం రూ. 26,674 కోట్లు కేటాయించడం బాధాకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
