![అనంతనాగ్ -రాజౌరిలో హైవేపై ముఫ్తీ బైఠాయింపు](https://static.v6velugu.com/uploads/2024/05/pdp-chief-mehbooba-mufti-who-is-contesting-from-anantnag-rajouri-seat-in-jammu-and-kashmir-has-alleged-that-they-are-preventing-their-party-workers-from-voting_mSk9JBL4qI.jpg)
బిజ్ బెహరా: తమ పార్టీ కార్యకర్తలను ఓటు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్ -రాజౌరి సీటు నుంచి పోటీ చేస్తున్న పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. బిజ్ బెహరా పోలీస్ స్టేషన్ ముందు శ్రీనగర్– -జమ్మూ నేషనల్ హైవేపై ఆమె బైఠాయించారు. తన ఫోన్ నుంచి ఔట్ గోయింగ్ కాల్స్ను సైతం నిలిపివేశారని ముఫ్తీ ఆరోపించారు.
అయితే, మిలిటెంట్లకు, అల్లర్లకు పాల్పడేవాళ్లకు సహకరించే వ్యక్తులను మాత్రమే తాము అదుపులోకి తీసుకున్నామని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, ఇదే నియోజకవర్గంలోని మెంధార్ పోలింగ్ కేంద్ర వద్ద ఇద్దరు అభ్యర్థుల మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మహిళలు సహా ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి రెండు వర్గాలను కట్టడి చేయడంతో గొడవ సద్దుమణిగింది.