ఫీజు రీయింబర్స్‌‌మెంట్, స్కాలర్‌‌‌‌షిప్‌‌లను విడుదల చేయాలి :పుల్లూరి సింహాద్రి

ఫీజు రీయింబర్స్‌‌మెంట్, స్కాలర్‌‌‌‌షిప్‌‌లను విడుదల చేయాలి :పుల్లూరి సింహాద్రి

సూర్యాపేట, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌‌ మెంట్‌‌, స్కాలర్‌‌‌‌షిప్‌‌లను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్‌‌ కాపాడాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌‌యూ ) జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి ప్రభుత్వాన్ని కోరారు.  సూర్యాపేట జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో బుధవారం పీడీఎస్‌‌యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని  డిగ్రీ కాలేజీలు బంద్ నిర్వహించి విద్యార్థులతో  కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా పీడీఎస్‌‌యూ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి మాట్లాడుతూ..   ఫీజు రీయింబర్స్‌‌మెంట్ పథకాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.  నేడు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి అవుతున్న విద్యార్థులకు  ఫీజు రీయింబర్స్‌‌మెంట్, స్కాలర్‌‌‌‌షిప్స్‌‌ ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు.

 రూ. 7200 కోట్లను పెండింగ్‌‌లో  ఉంచి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను విద్యను దూరం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పీడీఎస్‌‌యూ డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, నాయకులు సంధ్య, మానస, స్వాతి, మహేశ్వరి, లావణ్య, నందిని, ప్రసన్న, యశ్వంత్, మహేశ్, నవీన్, వినయ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.