సెక్రటేరియట్ ​ముట్టడికి వెళ్లిన పీడీఎస్ యూ నేతలు.. అడ్డుకున్న పోలీసులు

సెక్రటేరియట్ ​ముట్టడికి వెళ్లిన పీడీఎస్ యూ నేతలు.. అడ్డుకున్న పోలీసులు

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్​యూ నేతలు ఆగస్టు 25న రాష్ట్ర సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు.  సెక్రటేరియట్​లోని  ప్రార్థనా మందిరాలను గవర్నర్​ తమిళిసై, సీఎం కేసీఆర్​ ప్రారంభ కార్యక్రమం ఇవాళ్లే ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

పీడీఎస్​యూ నేతలను అమరవీరుల చిహ్నం వద్ద అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్​ చేసి స్టేషన్​కి తరలించారు.  అరెస్ట్ అయిన నేతలు మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​ సర్కార్​ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. 

పెండింగ్​లో ఉన్న ఫీ రీయింబర్స్​ మెంట్​ బిల్లుల్ని వెంటనే చెల్లించాలని డిమాండ్​చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.