దేశ ప్రయోజనాల కోసమే రైతుల శాంతియుత ఉద్యమం

దేశ ప్రయోజనాల కోసమే రైతుల శాంతియుత ఉద్యమం

కొత్త అగ్రి చట్టాల ద్వారా దేశానికి నష్టం వాటిల్లుతోందన్నారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. వీటి నుంచి దేశాన్ని రక్షించేందుకే రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారన్నారు. దీనికి సంబంధించి రాహుల్‌ హిందీలో ట్వీట్‌ చేశారు. రైతులకు మద్దతు తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం రైతులు శాంతియుత సత్యాగ్రహం చేస్తున్నారంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. నూతన చట్టాలతో రైతులకే కాదు…మొత్తం దేశానికే ప్రమాదమన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు రైతులకు మద్దతుగా నిలుస్తారని తెలిపారు రాహుల్.