నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి

నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి

వనపర్తి, వెలుగు: జిల్లాలో వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలనిఎస్పీ రావుల గిరిధర్  సూచించారు. ఆదివారం పట్టణంలోని విద్యానగర్​ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఎప్సీ దంపతులు పూజలు చేశారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనోత్సవాన్ని కూడా సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా, జాతీయ సమైక్యతను చాటేలా జరుపుకోవాలని సూచించారు. శోభాయాత్రను సాయంత్రం 4 గంటలకు ప్రారంభించి, క్రమశిక్షణతో రాజీవ్  చౌక్ కు చేరుకొని నిమజ్జనం చేయాలన్నారు. నిమజ్జనం సందర్భంగా సమస్య ఎదురైతే డయల్​ 100కు కాల్​ చేయాలని సూచించారు.