
పెబ్బేరు, వెలుగు: పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నెల రోజుల కింద ఎక్స్పైరీ అయిన మెడిసన్ను గర్భిణులకు ఇస్తున్నారని ఆదివారం ఓ యువకుడు హాస్సిటల్ ఎదుట ఆందోళనకు దిగాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీరంగాపూర్ మండలం నాగరాలకు చెందిన గణేశ్ భార్య ప్రస్తుతం 8 నెలల గర్భిణి. ప్రతి నెలా పెబ్బేరులోని రాఘవేంద్ర హాస్సిటల్లో చెకప్ చేయిస్తున్నాడు. డాక్టర్ రాసిచ్చిన ట్యాబ్లెట్స్ అక్కడే ఉన్న ఫార్మసీలో తీసుకుంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం హాస్సిటల్కు వెళ్లి ఫార్మసీలో ట్యాబ్లెట్స్ కొనగా, మే నెలలోనే ఎక్స్పైరీ అయినట్లు ఉంది.
అనుమానంతో సాయంత్రం మళ్లీ అవే ట్యాబ్లెట్లు కొనగా, అప్పడు కూడా వాళ్లు కాలం చెల్లిన మందులే ఇచ్చారు. దీనిపై హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే.. వారు ఇవి ఇంకా రెండు నెలలు పని చేస్తాయని చెప్పారు. గట్టిగా ప్రశ్నిస్తే మేడం లేరు.. వచ్చాక మాట్లాడుదామని మాట దాట వేస్తున్నారని బాధితుడు చెప్పాడు. ఈ విషయమై జిల్లా డ్రగ్ ఇన్ స్పెక్టర్ రష్మిని వివరణ కోరగా.. లీవ్లో ఉన్నానని, వచ్చాక ఎంక్వైరీ చేస్తామని చెప్పారు.