బిల్లులు ఇవ్వట్లేదు.. సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

బిల్లులు ఇవ్వట్లేదు.. సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ సర్పంచ్ మండల పరిషత్ ఆఫీసులోనే పురుగుల మందుతాగాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామ సర్పంచ్ అన్నేడి రవీందర్ రెడ్డి.. గ్రామంలో పలు రకాల అభివృద్ధి పనులు చేశారు. అప్పులు తీసుకొచ్చి మరీ పనులు పూర్తి చేశానని అన్నేడి రవీందర్ తెలిపారు. బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పురుగుల మందు తాగిన సర్పంచ్ ను వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.