2027లోనే జమిలీ ఎన్నికలు.. వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలి: పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి

2027లోనే జమిలీ ఎన్నికలు.. వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలి: పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి

వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027 ఫిబ్రవరిలోనే జిమిలి ఎన్నికలు వస్తాయని.. వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలని అన్నారు. ఈ విషయం ఓ కేంద్ర మంత్రి తనతో చెప్పారని అన్నారు పెద్దిరెడ్డి. వచ్చే ఎన్నికల్లో టీడీపీని సింగిల్ డిజిట్ కే పరిమితం చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. జమిలి ఎన్నికల ప్రస్తావన చాలాకాలం నుంచి ఉన్నప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇప్పుడు పెద్దిరెడ్డి లాంటి సీనియర్ నాయకుడు జమిలి ఎన్నికల ప్రస్తావన తేవడంతో మళ్ళీ చర్చ మొదలైంది.

ఆదివారం ( జూన్ 29 ) జరిగిన వైసీపీ జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్న పెద్దిరెడ్డి ఈమేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. నాలుక మందం అంటూ చంద్రబాబు గర్వంగా.. అహంకారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. బాబుకు మోసం చేయడం తప్ప చిత్తశుద్ధి తెలియదని అన్నారు. అక్రమ కేసులు పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. 

ప్రజలకు బాబుపై నమ్మకం పోయిందని.. పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు చేసిన మోసాలను వివరించాలని అన్నారు. జమిలి ఎన్నికలపై పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లోనే కాకుండా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కూడా చర్చకు దారి తీశాయి. ఒకవేళ నిజంగానే 2027లో జమిలి ఎన్నికలు వస్తే..  ఏపీ పాలిటిక్స్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వేచి చూడాలి.