ప్రైవేటు కాలేజీలకే జరిమానా

ప్రైవేటు కాలేజీలకే జరిమానా

ప్రభుత్వ కాలేజీలకు ఫైన్​పై ఇంటర్ బోర్డు వెనక్కి

హైదరాబాద్, వెలుగు: “అడ్మిషన్ గడువు దాటితే సర్కారు కాలేజీల్లోనూ జరిమానా” హెడ్డింగ్​తో గురువారం ‘వెలుగు’ పత్రికలో వచ్చిన కథనంపై ఇంటర్ బోర్డు స్పందించింది. జరిమానా.. ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు మాత్రమేనని, సర్కారు కాలేజీలతో పాటు సర్కారు సెక్టార్ కాలేజీల్లోని స్టూడెంట్లకు ఉండదని క్లారిటీ ఇచ్చింది. 3 రోజుల కింద ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్ గడువు పెంచుతూ ఇంటర్ బోర్డు అకడమిక్ ఆఫీసర్ వసుంధరదేవి ఇచ్చిన ఉత్తర్వులు వివా దాస్పదంగా మారాయి. ఈ నెల31 ఎలాంటి ఫైన్ లేదని, కానీ, ఆగస్టు1 నుంచి 16 వరకు అడ్మిషన్లు తీసుకునే వారు రూ.500 ఫైన్ చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ALSO READ:24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నం : కేటీఆర్