
జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల పరిధిలో సంచలనం సృష్టించిన పెంగ్విన్సెక్యూరిటీస్కేసును పోలీసులు ఈఓడబ్ల్యూ(ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్)కు బదిలీ చేశారు. కుత్బుల్లాపూర్నియోజకవర్గంలోని చింతల్సూర్యానగర్లో స్వాతి, బాలాజీ కలిసి పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. రూ.1లక్ష పెట్టుబడి పెడితే ప్రతి నెల రూ.12,500 చొప్పున 16 నెలలు చెల్లిస్తామని నమ్మబలికారు.
దీంతో చాలా మంది బాండ్ల రూపంలో సుమారు రూ.100 కోట్లకు పైగా ఇన్వెస్ట్చేశారు. ఇదే అదనుగా సంస్థ నిర్వాహకులు స్వాతి, బాలాజీ బోర్డు తిప్పేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి పోలీసులు కేసును ఈఓడబ్ల్యూకు బదిలీ చేశారు.