పెంగ్విన్​ కేసు ఈఓడబ్ల్యూకు బదిలీ

పెంగ్విన్​ కేసు  ఈఓడబ్ల్యూకు బదిలీ

జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల పరిధిలో సంచలనం సృష్టించిన పెంగ్విన్​సెక్యూరిటీస్​కేసును పోలీసులు ఈఓడబ్ల్యూ(ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్)కు బదిలీ  చేశారు. కుత్బుల్లాపూర్​నియోజకవర్గంలోని చింతల్​సూర్యానగర్​లో స్వాతి, బాలాజీ కలిసి పెంగ్విన్​ సెక్యూరిటీస్​ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. రూ.1లక్ష పెట్టుబడి పెడితే  ప్రతి నెల రూ.12,500 చొప్పున 16 నెలలు చెల్లిస్తామని నమ్మబలికారు. 

 దీంతో చాలా మంది బాండ్​ల రూపంలో సుమారు రూ.100 కోట్లకు పైగా ఇన్​వెస్ట్​చేశారు. ఇదే అదనుగా సంస్థ నిర్వాహకులు స్వాతి, బాలాజీ బోర్డు తిప్పేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు  జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి పోలీసులు కేసును ఈఓడబ్ల్యూకు బదిలీ చేశారు.