అయోధ్యలో రామ దర్బార్​ ప్రాణ ప్రతిష్ట

అయోధ్యలో  రామ దర్బార్​ ప్రాణ ప్రతిష్ట

అయోధ్య రామాలయంలో మరో అద్భుత కార్యక్రమం జరిగింది.  అంగరంగ వైభవంగా .. రామ మందిరం మొదటి అంతస్థులో రామదర్బార్​  ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది.  ఈ కార్యక్రమానికి  యూపీ సీఎం ఆదిత్యానాథ్​ సింగ్​ హాజరయ్యారు. 

అయోధ్య రామాలయం మొదటి అంతస్థులో రామదర్బార్​ప్రాణ ప్రతిష్ట అనంతరం..  భక్తులు రామ్​లల్లాను దర్శించుకున్నారు. శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్  తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం... ఈ రోజు ( జూన్​ 5)  ఉదయం 6 గంటలకు ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి.  ఆతరువాత మధ్యాహ్నం 1:25 నుండి 1:40 గంటల మధ్య అభిజీత్ ముహూర్తంలో శ్రీ రామ్ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది.  

 రామాలయంలోని మొదటి అంతస్తులో రామ దర్బార్ విగ్రహాలకు (రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు) ప్రాణ ప్రతిష్ఠతో పాటు మరో ఏడు దేవాలయాలలో విగ్రహాల ప్రతిష్ఠ జరుగుతుంది.  ఈ ప్రాణ ప్రతిష్ఠ ఆచారాన్ని చందౌలి జిల్లాకు చెందిన ప్రసిద్ధ పండిట్ జైప్రకాష్ నేతృత్వంలో 101 మంది వేద ఆచార్యులు నిర్వహించారు.

రామ్​ దర్భార్​ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన  పూజలు  జూన్​ 3న  ఉదయం 6.30 గంటలకు ప్రారంభమయ్యాయి.  అంతకు ముందు రోజు  సరయు నది పవిత్ర ఒడ్డున పవిత్ర కలశ యాత్ర నిర్వహించారు.  ఈ  యాత్రలో  పలువురు సాధువులు, ఆచార్యులు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ధర్మకర్తలు  పాల్గొన్నారు.