
అయోధ్య రామాలయంలో మరో అద్భుత కార్యక్రమం జరిగింది. అంగరంగ వైభవంగా .. రామ మందిరం మొదటి అంతస్థులో రామదర్బార్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం ఆదిత్యానాథ్ సింగ్ హాజరయ్యారు.
అయోధ్య రామాలయం మొదటి అంతస్థులో రామదర్బార్ప్రాణ ప్రతిష్ట అనంతరం.. భక్తులు రామ్లల్లాను దర్శించుకున్నారు. శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం... ఈ రోజు ( జూన్ 5) ఉదయం 6 గంటలకు ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఆతరువాత మధ్యాహ్నం 1:25 నుండి 1:40 గంటల మధ్య అభిజీత్ ముహూర్తంలో శ్రీ రామ్ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది.
రామాలయంలోని మొదటి అంతస్తులో రామ దర్బార్ విగ్రహాలకు (రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు) ప్రాణ ప్రతిష్ఠతో పాటు మరో ఏడు దేవాలయాలలో విగ్రహాల ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ ప్రాణ ప్రతిష్ఠ ఆచారాన్ని చందౌలి జిల్లాకు చెందిన ప్రసిద్ధ పండిట్ జైప్రకాష్ నేతృత్వంలో 101 మంది వేద ఆచార్యులు నిర్వహించారు.
రామ్ దర్భార్ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన పూజలు జూన్ 3న ఉదయం 6.30 గంటలకు ప్రారంభమయ్యాయి. అంతకు ముందు రోజు సరయు నది పవిత్ర ఒడ్డున పవిత్ర కలశ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పలువురు సాధువులు, ఆచార్యులు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ధర్మకర్తలు పాల్గొన్నారు.