
కాగజ్నగర్: వియత్నాంలో జరిగిన బైక్ ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతి చెందిన ఘటన విషాదం నింపింది. బైక్పై వేగంగా వెళ్తూ గోడని ఢీకొట్టి స్పాట్లోనే చనిపోయాడు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి వియత్నాంలో దుర్మరణం పాలయ్యాడు. కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో క్లాత్ బిజినెస్ చేస్తున్న అర్షిద్ అర్జున్-ప్రతిమ దంపతులకు కొడుకు అర్షిద్ అష్రిత్ వియత్నాంలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు.
వియత్నాంలో తెలంగాణ విద్యార్థి మృతి
— Praveen Naik BRS (@PraveenNaik007) June 5, 2025
బైక్ పై వేగంగా వెళ్తూ గోడని ఢీకొట్టి మృతి
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి వియత్నాం దేశంలో దుర్మరణం
కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో బట్టల వ్యాపారి అర్జున్-ప్రతిమ దంపతులకు కుమారుడు అర్షిద్ అష్రిత్ pic.twitter.com/yilGMWpaGU
వియత్నాంలోని కాంతో సిటీలో చదువుతున్న అర్షిద్ అష్రిత్ బుధవారం పొద్దుపొద్దున్నే 6 గంటల సమయంలో ఫ్రెండ్తో కలిసి బైక్పై వెళుతున్నాడు. అతి వేగంతో బైక్ డ్రైవ్ చేయడంతో టర్నింగ్ దగ్గర బైక్ కంట్రోల్ కాక రోడ్డు పక్కనే ఉన్న ఇంటి గోడను ఢీ కొట్టాడు. అంత వేగంగా వెళ్లి గోడను ఢీ కొట్టడంతో అష్రిత్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ బైక్ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ విజువల్స్ చూసిన నెటిజన్లు ప్రమాదం జరిగిన తీరును చూసి నివ్వెరపోయారు.
మలుపు దగ్గర అంత స్పీడ్గా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని కామెంట్ చేశారు. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న అష్రిత్ స్నేహితుడు కూడా తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. అష్రిత్ ఇలా బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడని వియత్నాం నుంచి సమాచారం అందగానే అతని తల్లిదండ్రులు షాక్లోకి వెళ్లిపోయారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని వస్తాడనుకుంటే ఇలా అర్థాంతరంగా అష్రిత్ తనువు చాలించడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.