తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆసక్తికరమై ట్వీట్ చేశారు. నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారంటూ గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. తెలంగాణ సోదర సోదరీమణులారా.. రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయ్యండని, కాంగ్రెస్ ను గెలిపించండని ఎక్స్ వేదికగా కోరారు.
నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు.
— Rahul Gandhi (@RahulGandhi) November 30, 2023
నా తెలంగాణ సోదర సోదరీమణులారా!
రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండి.
బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయ్యండి! కాంగ్రెస్ ను గెలిపించండి!
Today, Prajala will defeat Dorala!
Brothers and sisters of Telangana, step out and vote in large… pic.twitter.com/yvrvNMBziX
ఇదే తరహాలో ప్రియాంక గాంధీ వాద్రా తన అభిప్రాయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో, శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఓటు వేయడం అందరి హక్కని, అది అతిపెద్ద బాధ్యత అని ఆమె గుర్తు చేశారు. ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసి చూపండని తెలిపారు.
నా తెలంగాణ సోదర సోదరీమణులారా..
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 30, 2023
మా తల్లులారా..పిల్లలారా
మీరు బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో, శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.
ఓటు వేయడం మీ హక్కు, అది మీ అతిపెద్ద బాధ్యత.
ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసి చూపండి.
అభినందనలు
జై తెలంగాణ
జై హింద్
तेलंगाना की… pic.twitter.com/w1kyvKKl8K