ప్రజలు ఏ ఒక్క పార్టీని, నాయకుడిని నమ్మే పరిస్థితిలో లేరు

ప్రజలు ఏ ఒక్క పార్టీని, నాయకుడిని నమ్మే పరిస్థితిలో లేరు
  • బీఎస్ పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మెదక్: రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీని, నాయకుడిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు బహుజన సమాజ్ వాదీ పార్టీ  రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.  ప్రజలకు బీఎస్పీ అన్నివిధాలా అండగా ఉంటుందని చెప్పారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో బీఎస్పీ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ముఖ్య కార్యకర్తలు, నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీని బలమైన రాజకీయ శక్తిగా తయారు చేస్తామన్నారు. సమస్యలపై పాలకులను ప్రశ్నించి వాటి పరిష్కారం కోసం పోరాడినప్పుడే సమసమాజం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.