టైంకు రాని మండల పరిషత్​ ఆఫీసర్లు .. గంటకు పైగా ఎదురుచూసిన లబ్ధిదారులు

టైంకు రాని మండల పరిషత్​ ఆఫీసర్లు .. గంటకు పైగా ఎదురుచూసిన లబ్ధిదారులు

కాగజ్ నగర్, వెలుగు: ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకుండా ఆఫీసులకు తీరిగ్గా వస్తుండడంతో వారి కోసం ఎదురుచూస్తూ ప్రజలు, లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. సోమవారం చింతలమానేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ అధికారులు, సిబ్బంది ఉదయం 11 గంటల వరకు కూడా ఆఫీస్​కు రాలేదు.

ప్రజాపాలనలో భాగంగా గృహజ్యోతి పథకానికి సంబంధించి తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎంపీడీఓ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ వద్దకు వివిధ గ్రామాల నుంచి ఉదయమే వచ్చిన లబ్ధిదారులు.. అధికారుల కోసం గంటకు పైగా వేచి చూశారు. 11  గంటల తర్వాత ఒక్కక్కరు తీరిగ్గా ఆఫీస్ కు చేరుకున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టి అధికారులకు ఆఫీసులకు టైమ్​కు వచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.