కాగజ్ నగర్ టౌన్ లో నీళ్లకోసం జనాలు గోస

కాగజ్ నగర్ టౌన్ లో నీళ్లకోసం జనాలు గోస

కాగజ్ నగర్ టౌన్ లో నీళ్లకోసం జనాలు గోస పడుతున్నారు. పది రోజులుగా మిషన్ భగీరథ నీళ్ళ సప్లయ్ నిలిచిపోవడంతో జనాలు ఆగ్రహించారు. దీంతో అధికారులు గురువారం మిషన్ భగీరథ నీళ్లు సప్లయ్​ చేశారు. కానీ, అవన్నీ బురదమయంగా ఉన్నాయి.

సప్లయ్ అవుతున్న అరగంట, గంట సేపు కూడా మంచినీళ్లు అందడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఈ విషయం పై మున్సిపల్ కమిషనర్ అంజయ్య ను సంప్రదించగా మురికి నీళ్లు వచ్చినట్టు  తనకు తెలియదని, ఈ నీళ్ళు మిషన్ భగీరథ అధికారులు చూసుకుంటారని, ఇంకో నెలలో పంప్ హౌజ్ నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పారు.